బెల్లంపల్లి కాల్టెక్స్ ఏరియా "లైన్స్ క్లబ్" నూతన కార్యవర్గం ఎన్నిక
Published: Wednesday April 20, 2022
బెల్లంపల్లి ఏప్రిల్ 19 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణ కాల్టెక్సు ఏరియా లైన్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు లైన్స్ క్లబ్ కాల్టెక్స్ ఏరియా అధ్యక్షుడు పేరాల రాయమల్లు తెలిపారు. మంగళవారం నాడు కాల్ టేక్స్ ఏరియాలోని మంజునాథ ఫైనాన్స్ కార్యాలయంలో, ఏర్పాటు చేసిన సమావేశంలో 2022-23 సంవత్సరానికి గాను నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని, అధ్యక్షుడిగా లయన్, నెల్లి రమేష్, 1వ ఉపాధ్యక్షునీగా లయన్, కట్ల అశోక్, 2వ ఉపాధ్యక్షునీగా లయన్, ఎం, ఉమామహేశ్వర్, కార్యదర్శిగా లయన్, సూరమ్ లక్ష్మీనారాయణ, కోశాధికారిగా లయన్ చింతల వేణులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పేరాల రాయమల్లు, బంక కుమార్, నెల్లి రమేష్, కట్ల అశోక్, ఈగ నరసయ్య, జే, చంద్ర శేఖర్, బిరుదు రవి, సూరం లక్ష్మీనారాయణ, ఆర్, శ్రీనివాస్, చింతల వేణు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: