ఆలయాన్ని సందర్శించిన డీసీఎంఎస్ చైర్మన్ శేషగిరిరావు.

Published: Tuesday April 19, 2022
జడ్పీటీసీ ప్రమీల దంపతులకు లక్షా విరాళం అందజేత..
తల్లాడ, ఏప్రిల్ 18 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని కలకొడిమ గ్రామంలో నిర్మాణంలో ఉన్న శ్రీ కోదండరామ సహీత  కలకొడిమేశ్వర ఆలయాన్ని ఖమ్మం డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, పద్మావతి దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తల్లాడ జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, ఆలయ కమిటీ చైర్మన్ దిరిశాల దాసురావులతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ దంపతుల విజ్ఞప్తి మేరకు డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు ఆలయ అభివృద్ధికి లక్ష నూట పదహార్లు అందించారు. ఈ సందర్భంగా ఆయనను వారు ప్రత్యేకంగా శాలువాలు పూలదండలతో సత్కరించారు. అదేవిధంగా ఈనెల 25వ తేదీన భారీఎత్తున ఆలయ ప్రతిష్ట జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామివార్ల తీర్థప్రసాదాలు పొంది వారి కృపకు పాత్రులు కావాలని జడ్పిటిసి కోరారు. ఈ కార్యక్రమంలో కుర్నవల్లి సొసైటీ చైర్మన్ ఐలూరి ప్రదీప్ రెడ్డి, ఎంపీటీసీ ఆదూరి వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ నాయకులు బండి మోహన్ రావు, యాదవ సంఘం నాయకులు అయితంరాజు, యూత్ నాయకులు మనుబోలు నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.