కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు : కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్

Published: Tuesday May 11, 2021
మేడిపల్లి, మే10 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 3వ డివిజన్లో కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్థానిక కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ తెలిపారు. డివిజన్లోని ఎంఎల్ఆర్ కాలనీలో మెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, జవాన్ అశోక్ తో కలిసి కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ ఇంటింటా జ్వరం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కరోనా నివారణ చర్యల్లో భాగంగా డివిజన్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నామని తెలిపారు. కరోనా పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వ నియమ, నిబంధనలను ప్రతిఒక్కరు పాటిస్తూ, ముఖాలకు మాస్కులు,  భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు రంగా బ్రహ్మన్న, డివిజన్ టీఆర్ఎస్ ధ్యక్షులు మేకల శ్రీనివాస్ యాదవ్, కాలని అధ్యక్షుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.