*మధిరకు 30 కోట్లు మంజూరు పట్ల మున్సిపల్ చైర్మన్ మొండితోక లత జయకర్ పాలక వర్గం హర్షం

Published: Friday March 03, 2023
మధిర మార్చి 2 ప్రజాపాలన ప్రతినిధిమున్సిపాలిటీ మధిర మున్సిపాలిటీకినిధులు మంజూరు కోసం కృషిచేసిన మంత్రి పువ్వాడ జిల్లా పరిషత్ చైర్మన్ కమల్ రాజుకి  కృతజ్ఞతలు
మధిర మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 30 కోట్ల రూపాయలకి మందించిన జీవో విడుదల కావడం పట్ల మధిర మున్సిపాలిటీ బిఆర్ఎస్  మున్సిపల్ చైర్మన మొండితోకలత  జయకర్ పాలకవర్గం మున్సిపాలిటీ తరఫున హర్షం వ్యక్తం చేశారు. జనవరి 18న ఖమ్మంలో జరిగిన సభలో మధిర మున్సిపాలిటీకి 30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం జరిగిందన్నారు. వీటిని జీవో రూపంగా తీసుకొచ్చేందుకు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ నిరంతరం కృషి చేసి సాధించారన్నారు. మధిర మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ కి మున్సిపాలిటీ ప్రజలు రుణపడి ఉన్నారని మున్సిపల్ చైర్మన్ మొండితోక లతా జయకర్ పాలకవర్గం తరపున అభినందనలు తెలుపుతూ మున్సిపాలిటీ కిఈ నిధులతో మధిర పట్టణం మరింత అభివృద్ధి సాధిస్తుందని మున్సిపల్ చైర్మన్ మునితోకలత  జయకర్ పాలకవర్గం  ఆశాభవం వ్యక్తం చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమరాజ్ సహకారంతో ఇప్పటికే మధిర మున్సిపాలిటీలో ట్యాంకుబండ నిర్మాణ పనులు, సమీకృత మార్కెట్ పనులు, 100 వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు, ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నా యని వారు అన్నారు. మధిర పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల