మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Published: Friday January 27, 2023
బోనకల్, జనవరి 26 ప్రజా పాలన ప్రతినిధి:  మండలంలో 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మండల తాసిల్దార్ కార్యాలయంలో ఇన్చార్జి తాసిల్దార్ సంగు శ్వేత, పోలీస్ స్టేషన్ లో ఎస్సై తేజావత్ కవిత, మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ నళిని శ్రీ, ఐకెపి కార్యాలయంలో ఏపీఎం యద్దనపూడి పద్మలత, జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి వేముల స్రవంతి, నీటిపారుదల శాఖ కార్యాలయంలో డి ఈ పబ్బతి శ్రీనివాస్, విద్యుత్తు కార్యాలయంలో ఏఈ దొండేటి ఉమామహేశ్వరరావు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ బుడిపాటి కమలవాహిని, బాలికల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ భూక్యా పార్వతీ ,బాలుర గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ తాడి అంజలి, మండల కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం, ఆటో స్టాండ్ల వద్ద ఎస్సై తేజావత్ కవిత జాతీయ పథకాలను ఆవిష్కరించారు. ఎస్బిఐ, ఏపీజీవీబీ, డి సి సి బి బోనకల్ బ్రాంచ్ ల నందు మేనేజర్ల కొల్లి మధుకర్, మల్లిక్, సీతారాములు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. బోనకల్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ భూక్యా సైదా నాయక్, ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, గ్రామపంచాయతీ కార్యాలయ వద్ద సర్పంచులు, రైతు వేదిక వద్ద, ఎంఆర్సి కార్యాలయ వద్ద జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ  కార్యక్రమాలలో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, జడ్పిటిసి మోదుగు సుధీర్ బాబు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గుగులోతు రమేష్ ,మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు షేక్ జమాలుద్దీన్, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, బీ ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జున్ రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు, వైఎస్ఆర్ టిపి మండల అధ్యక్షుడు షేక్ మౌలాలి ,రావినూతల, రామాపురం ఎంపీటీసీలు కందిమల్ల రాధ, ముక్కపాటి అప్పారావు, బోనకల్ సర్పంచ్ భూక్య  సైదా నాయక్, ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవరావు, ఎంపీ ఓ వ్యాకరణం వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, ఏపీవో బసవోజు కృష్ణకుమారి, ఈజిఎస్ ఈసీ పిల్లుట్ల కిరణ్ కుమార్, గిర్దావర్లు గుగులోతు లక్ష్మణ్, జి సత్యనారాయణ ఆయా కార్యాలయాల సిబ్బంది, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.