అతిథి అధ్యాపకుల కోసం దరహస్తులు ఆహ్వానం

Published: Monday July 25, 2022

మధిర  జులై 24 ప్రజాపాలన ప్రతినిధి మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, మరియు కంప్యూటర్ అప్లికేషన్ బోధించేందుకు అతిథి అధ్యాపకులు నియామకం కోసం అర్హులైన వారి నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శాస్త్రి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీహెచ్డీ చేసి నెట్, సెట్, బోధనా అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ నెల 26 నుండి 28 లోపు మధిర డిగ్రీ కళాశాలలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 30న ఉదయం 10 గంటల ముప్పై నిమిషాలకు ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూకి హాజరు కావలసిందిగా ఆయన కోరారు.