ముక్తకంఠంతో కేసీఆర్ అహంకార ధోరణిని ఖండిస్తున్నా : మండల బిజెపి నాయకులు

Published: Friday February 04, 2022
బోనకల్, ఫిబ్రవరి 3 ప్రజాపాలన ప్రతినిధి: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు భారత రాజ్యాంగం పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంతో దుమారం రేపిన సంగతి తెలిసిందే, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ సూచన మేరకు బోనకల్ మండలం రావినూతల గ్రామంలో బిజెపి భీమ్ దీక్ష చేపట్టడం జరిగింది. కెసిఆర్ అహంకార మాటలతో మైల పడిపోయిన అంబేద్కర్ శోభను బిజెపి నాయకులు పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం బిజెపి నాయకులు ముక్తకంఠంతో కెసిఆర్ అహంకార ధోరణి నిరంకుశ పాలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు వీరపనేని అప్పారావు, బిజెపి యువనేత ఎన్ఆర్ఐ బీపీ నాయక్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గుగులోతు నాగేశ్వరరావు, ఓబీసీ జిల్లా మోర్చా ప్రధాన కార్యదర్శి జంపాల రవి, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరి సురేష్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కారంగుల మురళి, బీజేవైఎం మండల అధ్యక్షులు కాలా సాని పరశురాం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.