ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రతినిధులను సన్మానించిన కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్

Published: Wednesday March 24, 2021
మేడిపల్లి, మార్చి23 (ప్రజాపాలన ప్రతినిధి) : ఇటీవల నూతనంగా ఎన్నికైన ఉప్పల్  ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతుల వెంకట్ రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కూకుట్ల నరోత్తం రెడ్డిని మరియు కమిటీ సభ్యులను చిలుకా నగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ వార్డు కార్యాలయంలో ఘనంగా శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గీత ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ ఉప్పల్ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ  వర్కింగ్ ప్రెసిడెంట్  వేముల తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు ఏవి. శ్రీధర్రావు, కోశాధికారి ఆర్ యాదగిరి గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శి రాజు, సలహాదారులు కొలనుపాక చంద్రమౌళి,  దుపాటి సురేశ్, పల్లా మహేందర్ రెడ్డి, మరియు జర్నలిస్టు కిషోర్ పాల్గొన్నారు.