మహాశివరాత్రి పర్వదినం రోజున ఎమ్మెల్యే సంజయ్ దంపతులు ప్రత్యేక పూజలు

Published: Monday February 20, 2023

సారంగాపూర్, ఫిబ్రవరి 18 (ప్రజపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ పెంబట్ల కొనపూర్ శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి వారిని మహాశివరాత్రి పర్వదినం రోజున స్థానిక ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ రాధిక సతి సమేతంగా దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు స్వాగతం పలికి స్వామివారి మెమోంటో షాలువలతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి తాటిపర్తి విజయలక్ష్మి డా: శైలందర్ రెడ్డి భోగ శ్రావణి ఎస్పీ భాస్కర్ తదితరులు దర్శనం చేసుకున్నా వారిలో ఉన్నారు. వారి వెంట ఆలయ ఈవో కాంతారెడ్డి ఎంపీపీ కోలా జమునశ్రీనివాస్ జడ్పీటిసి మేడిపల్లి మనోహర్ రెడ్డి సర్పంచులు బొడ్డు రాజన్న ఆకుల జమున పోరండ్ల శంకరయ్య ఆలయ అధికారులు నాయకులు భక్తులు పాల్గొన్నారు.