బీజేపీ ధారూర్ మండల ఇంచార్జీగా మధుసూధన్ రెడ్డి

Published: Tuesday February 21, 2023

వికారాబాద్ బ్యూరో 20 ఫిబ్రవరి ప్రజాపాలన : వికారాబాద్ జిల్లా ధారూర్ మండల బీజేపీ ఇంచార్జీగా గొట్టిముక్కల గ్రామానికి చెందిన మధుసూధన్ రెడ్డిని నియమించారు. తనపై నమ్మకంతో భాద్యతలు అప్పగించిన మాజీ మంత్రి బిజెపి నాయకులు చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు సదానంద రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ధారుర్ లో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తామని,బీజేపీ శ్రేణులు పార్టీ పటిష్టత కోసం పని చేయాలని కోరారు.రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు.