క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Monday December 26, 2022
మేడిపల్లి, డిసెంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి)
 క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని  రామంతాపూర్ డివిజన్లోని న్యూ లైఫ్ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో  ముఖ్యమంత్రి కేసీఆర్  అధికారికంగా క్రిస్మస్ పండుగను జరిపిస్తున్నారన్నారు.
ఉప్పల్ బగాయత్ లో నిర్మించబోయే క్రైస్తవ భవనంనకు  సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. క్రైస్తవ ఫాస్టర్లకు,సోదర, సోదరీమణులకు ఎమ్మెల్యే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ పాస్టర్ బొంత శామ్యూల్ సాజన్ కుమార్, ప్రొఫెసర్ జయ కుమార్, మధు, రాజశేఖర్, మోహన్, మురళి, స్టీవెన్, బి ఆర్ ఎస్ నాయకులు గరిక సుధాకర్, నంది కంటి శివ, సూరం శంకర్, క్రైస్తవ సోదర, సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.