ఉప్పల్ డివిజన్లో రూ 35 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బేతి సుభాష

Published: Friday January 06, 2023
మేడిపల్లి, జనవరి 5 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ డివిజన్లోని న్యూ విజయపురి  కాలనీలో రూ 35 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి  ప్రారంభించారు.స్థానిక కాలనీవాసులు ఎమ్మేల్యేకు కాలనీ సమస్యలు త్రాగునీరు, విద్యుత్, తెలుపగా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 
 ఈఈ  నాగేందర్, డీ.ఈ నిఖిల్ రెడ్డి, ఏ. ఈ.వసంత బీఆర్ఎస్ సీనియర్ నాయకులు  జనుంపల్లి వెంకటేశ్వర్  రెడ్డి,గడ్డం రవికుమార్  గరిక సుధాకర్, ఉప్పల్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల సంతోష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మస్క సుధాకర్, నాయకులు, చింతల నరసింహారెడ్డి,టం టం వీరేష్, స్వీట్ హౌస్ రాజు, యాదగిరి రెడ్డి, వంశీ ముదిరాజ్, వేముల వెంకట్ రెడ్డి, న్యూ విజయపురి కాలనీ అధ్యక్షులు పెద్దోళ్ల నాగి రెడ్డి, తెల్కల మోహన్ రెడ్డి, తుమ్మల దేవి రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.