జర్నలిస్టులను ఆదుకోవాలి : కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా

Published: Monday July 19, 2021
మెట్ పల్లి,జూలై 18, (ప్రజాపాలన ప్రతినిధి) విధినిర్వహణలో నిరంతరం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న జర్నలిస్టులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సమాజానికి సేవ చేస్తున్న జర్నలిస్టుల కష్టసుఖాలను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. వారి కష్టాలను గుర్తించి ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని, అందరికీ హెల్త్ కార్డులు అందించాలని, ఇల్లు లేని ప్రతి ఒక్క జర్నలిస్టుకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయించాలని అని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడకుండా అవసరమైన సహకారం అందించాలని కోరారు.