కోటి 30 లక్షల రూపాయల అభివృద్ది పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

Published: Tuesday July 20, 2021
జిన్నారం, జులై 19, ప్రజాపాలన ప్రతినిధి : జిన్నారం మండల పరిధిలోని అల్లి నగర్, కిష్టయ్య పల్లి గ్రామాల పరిధిలో గ్రామ పంచాయతీ నిధులు అలాగే పలు పరిశ్రమల సి, ఎస్, ఆర్ నిధులు సుమారు కోటి 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను సోమవారం పటాన్చేరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, సర్పంచ్ ప్రకాశ్ చారి, జడ్పి ఉపాధ్యక్షుడు ప్రభాకర్, ఎంపీపీ రవీందర్ గౌడ్ తో కలిసి ప్రారంబించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మమత పెంటేష్, గ్రామ కార్యదర్శి నరేష్ బాబు, జిల్లా టీఆర్ఏస్ యువత అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ఎంపిటిసి జనాభాయి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్, పలు గ్రామాల సర్పంచ్ లు, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు ఓంకార్, వేణు, వెంకటేష్, సత్యనారాయణ, వీరేశం గౌడ్, రాములు, దేవా, అధికారులు, పలు పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నాయి.