మాటూర్ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణపక్వాడ్ చిరుధాన్యాలపై అవగాహనా సదస్సు

Published: Wednesday March 29, 2023

మధిర, మార్చి 28 ప్రజాపాలన ప్రతినిధి: మధిర మండలంలోని మాటూరు అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో *పోషణ్ పక్వాడ్* కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా చిరుధాన్యాలపై అవగాహన, సామూహిక శ్రీమంతాలు, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఐసిడిఎస్ సూపర్వైజర్ అన్నపూర్ణ చిరుధాన్యాలపై, ఆకుకూరల ఆవశ్యకతపై అందరికీ అవగాహన కల్పిస్తూ తప్పనిసరిగా అందరూ తమ కుటుంబంలో వాడేటట్లు చూడాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడిశెట్టి లీలావతి ఎంపీటీసీ అడపాల వెంకటేశ్వర్లు, గ్రామ సెక్రెటరీ, అంగన్వాడి టీచర్లు, కె నాగేంద్ర, కె సునీత, ఎస్ అంజలి, కె వరలక్ష్మి,కె సంధ్య, గ్రామ దీపిక జయశ్రీ, ఆశ వర్కర్ ఎం.వి లక్ష్మి, వెంకయ్య డ్వాక్రా గ్రూప్ సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.