ప్రజా సమస్యలపై పాద యాత్ర చేస్తున్న వైయస్ షర్మిలకు.ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపాలి

Published: Monday March 14, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి ఆనాడు స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఎండ వానను కూడా లెక్క చేయకుండ ఆరోగ్యం క్షీనించిన ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్న గొప్ప నాయకుడు వైయస్సార్ పాదయాత్ర సమయంలో ప్రజలకు ఎదురైన సమస్యలు దృష్టిలో పెట్టుకొని నేను ముఖ్యమంత్రి అయ్యితే మీ సమస్యలు పరిష్కరిస్తాను అని ప్రజలకు మాట ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యిన తరువాత ప్రజలకు ఎదురైన అన్ని సమస్యలు పరిష్కరించి ప్రజల గుండెల్లో ఒక దేవుడిలా నిలిచిన గొప్ప ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర రెడ్డి అదే మాదిరి తండ్రి ఆశయాలను నేర వేర్చటానికి తెలంగాణ రాష్ట్రంలో.మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి  తన తండ్రి సంక్షేమ పథకాలు కోన సాగించాలి అని వైయస్సార్ తెలంగాణ పార్టీ  ఏర్పాటు చేసి ఒక వీర వనితల పార్టీ ఏర్పాటు చేయ ముందే ప్రజా సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై పోరాటం చేసి చరిత్ర సృష్టించి ప్రతి సమస్య పై తనదైన శైలిలో పోరాటం చేస్తూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వనికి ముచ్చెమటలు పట్టిస్తున్న డైనమిక్ ఒక మహిళ వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రజా సమస్యలపై తన తండ్రి లాగా మహా ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసు కోవాలి అని తెలంగాణ రాష్ట్రం లోని అన్ని నియోజకవర్గలో దాదాపు 4000 వేళా కిలో మీటర్లు పాదయాత్ర చేయాలి ప్రజా సమస్యలు తెలుసు కోవాలి ఎక్కడ అయితే పాదయాత్ర లో ప్రజల సమస్యలు ఎదురు అవుతాయో అక్కడ నుండే ప్రభుత్వం పై పోరాటం చేయాలని ఉద్దేశంతో ఎండను సైతం లెక్క చేయకుండా మహా ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటు ప్రతి ఒక్కరినీ అన్న తమ్ముడు అక్క చెల్లి అమ్మ అంటూ ఆప్యాయంగా తన తండ్రి వైయస్సార్ లాగా పలకరిస్తూ పాదయాత్ర చేస్తున్న వైయస్ షర్మిలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మద్దతు తెలిపి సమస్యలు చెప్పు కోవాలి అన్నారు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ నాయకురాలిగా వైయస్ షర్మిల చరిత్ర సృష్టించి తెలంగాణ రాష్ట్రనికి తొలి మహిళా ముఖ్యమంత్రి వైయస్ షర్మిల కావటం కాయం అన్నారు