రాజ్యసభ సభ్యులకు ఘనస్వాగతం పలకాలి.. సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకటవీరయ్య..

Published: Monday November 14, 2022
తల్లాడ, నవంబర్ 13 (ప్రజాపాలన న్యూస్):  రాజ్యసభ సభ్యులు బండి పార్ధసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ఈ నెల 18న సత్తుపల్లికి రానున్న సందర్భంగా వారికి ఘన స్వాగతం పలకాలని సత్తుపల్లి శాసనసభ్యులు సంర వెంకట వీరయ్య పిలుపునిచ్చారు. ఆదివారం తల్లాడలో మండల అధ్యక్షులు వీరమోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తల్లాడలో భారీ బహిరంగ సభతో ఘన స్వాగతం పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరి రావు, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, జడ్పిటిసి దిరిశాల ప్రమీల, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దుగ్గిదేవర వెంకటలాల్, మార్కెట్ వైస్ చైర్మన్ ధూపాటి భద్రరాజు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.