జర్నలిస్టు గిరిబాబు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

Published: Monday June 28, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి పట్టణ కేంద్రానికి చెందిన భువనగిరి సాక్షి టివి రిపోర్టర్ కరోనాతో మరణించిన గిరిబాబు కుటుంబానికి వై ఎస్ సి ఎ యూత్ సభ్యులు అందరూ కలిసి సేకరించిన డబ్బులు 16 వేల రూపాయలు ఆదివారం గిరిబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అందచేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పలుసం రాజు, పబ్బు స్వామి, సాయిని యాదగిరి, రచ్చ గణేష్ తదితరులు పాల్గొన్నారు.