కార్మికుడి కుటుంబానికి అండగా ఎమ్మెల్యే

Published: Friday December 03, 2021
కాగజ్ నగర్, డిసెంబర్ 2, ప్రజాపాలన ప్రతినిధి : కొమురం భీం  ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో గల ఎస్పీఎం పేపర్ మిల్ లో ఇటీవలే ప్రమాదవశాత్తు మృతి చెందిన అందెల్లి గ్రామానికి చెందిన గ్యార మోహన్ రావు కుటుంబానికి అండగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిలిచారు. ఈ రోజు వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే వారి పిల్లల చదువు బాధ్యత కూడా తీసుకుంటానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.