కొండా - అండ కార్యక్రమానికి సహాయం చేసిన 3వ వార్డు నెంబర్ జయ కుమారి దంపతులు

Published: Monday June 21, 2021
బోనకల్లు, జూన్ 20, ప్రజాపాలన ప్రతినిధి 20వ తేదీబోనకల్ గ్రామంలో గత 29 రోజులుగా కొండ అండ కార్యక్రమం ద్వారా కరోనా వైరస్సోకి బాధపడుతున్న గ్రామస్తులకు మండల మాజీ జెడ్పిటిసి బానోతు కొండ బాధితులకు అండగా నిలిచి ఉచిత భోజన సౌకర్యాన్ని అందిస్తున్నారుఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కరోనా బాధితులకు అందిస్తున్న భోజనంలో బోనకల్ గ్రామపంచాయతీ మూడవ వార్డు నెంబర్ జయ కుమారి, అంజయ్య దంపతులు భోజనంలోకి మాంసాహార విందును అందజేశారు ఈ సందర్భంగా జయ కుమారి, అంజయ్య మాట్లాడుతూ.. బోనకల్ గ్రామంలో కరోనా బాధితులకు మాజీ జెడ్పిటిసి బానోతు కొండ అండగా నిలిచి బాధితులకు మూడు పూటలా ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించడం గర్వించదగ్గ విషయమన్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం కొంతమందికే సాధ్యమవుతుందని, క్లిష్ట పరిస్థితుల్లో లో కరోనా బాధితులకు అండగా నిలిచిన కొండాకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో. మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ. అంతోటి అంజయ్య, జయ కుమారి, మోర్ల మహేశ్వరరావు, ధరావత్ బాలకృష్ణ, అంతోటి ఆది తదితరులు పాల్గొన్నారు.