ఇళ్ల పట్టాల కాల పరిమితిని మరో రెండు నెలలు పొడగించాలి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, దివాకర్ రావ

Published: Tuesday June 07, 2022
బెల్లంపల్లి జూన్ 6 ప్రజా పాలన ప్రతినిధి:.రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ప్రాంతాలలో పట్టాలు ఇవ్వడానికి నిర్ణయించిన కాలపరిమితిని మరో రెండు నెలలు పొడిగించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో సోమవారం హైదరాబాదులో నిర్వహించిన సమావేశంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావులు, విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సోమవారం నాడు "ప్రజా పాలన " ప్రతినిధితో మాట్లాడుతూ , సింగరేణి ఇండ్ల పట్టాలకు సంబంధించి విడుదల చేసిన జి ఓ  నంబర్ 76 ప్రకారం  కాలపరిమితిని మరో రెండు నెలలు పొడగించాలని, బెల్లంపల్లి పట్టణంలోని ఎస్ ఆర్ టి క్వాటర్స్ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని, జిల్లాలోని రెవిన్యూ- ఫారెస్ట్, మధ్య నెలకొన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,  నడిపల్లి దివాకర్ రావు, వీరితో పాటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ , పాల్గొన్నారు.