ఉసిర్కెపల్లి దీపక్ రావును పరామర్శించిన ఖేఢ్ శాసనసభ్యులు

Published: Wednesday January 19, 2022
హైదరాబాద్ 17 జనవరి ప్రజాపాలన ప్రతినిధి : ఉసిర్కెపల్లి గ్రామానికి చెందిన దీపక్ రావును పరామర్శించిన ఖేఢ్ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం మనూర్ మండలం ఉసిర్కెపల్లి గ్రామానికి చెందిన సరస్వతి భర్త దీపక్ రావు అనారోగ్యంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉసిర్కెపల్లి దీపక్ రావు ను నారాయణ్ ఖేడ్ శాసన సభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. త్వరలో కోలుకుంటారు అని ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు.