మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య...

Published: Monday October 11, 2021
బీరుపూర్, అక్టోబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండల కేంద్రానికి చెందిన మసర్తి తిరుపతి (25) మనస్తాపానికి గురై ఆదివారం ఉదయం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్ని నెలల క్రితం గల్ఫ్ దేశాలకు వెల్లి వచ్చాడని ఈ మధ్యనే పెళ్లి కుదిరిందని సమాచారం. చేతికి అందిన కొడుకు ఈ సంఘటనకు పాల్పడటం ఏంటని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబంలో విచాద చాయలు అలుముకున్నాయి.