పట్టణ ప్రగతిలో సమస్యలు పరిష్కారం
Published: Saturday July 03, 2021
మేడిపల్లి, జూలై 2 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి దోహద పడుతుందని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ హాజరయ్యారు. పట్టణ ప్రగతిలో చేయబోయే పనులు కాలనీ వాసుల సహకారం మరియు వార్డు కమిటీ సభ్యుల పాత్ర గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ మమత, డి ఈ, ఐఐసిటి కాలనీ అధ్యక్షులు బిపి చారి, అడ్వైజర్ బుచ్చి రెడ్డి, ప్రధాన కార్యదర్శి రుద్ర దాసు, డివిజన్ అధ్యక్షులు పబ్బు సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు పూర్ణిమ, సతీష్ కుమార్, మాణిక్ ప్రభు, సునీత, కమిటీ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: