యాసంగి పంట పై రైతులకు అవగాహన సదస్సు
Published: Thursday December 09, 2021
బోనకల్, డిసెంబర్ 8 ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని గోవిందపురం ఏ గ్రామంలో యాసంగి పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గ్రామంలోని భాగం నాయుడు మరియు బాలినేని విమల జ్ఞాపకార్థం నిర్మించిన రైతు వేదికలో జరిగినది. వ్యవసాయ అధికారి ఏ ఈ ఓ ఈ సాధన ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతు కోఆర్డినేటర్ భాగం మధుసూదన్ రావు, టిఆర్ఎస్ మండల నాయకుడు భాగం నాగేశ్వరరావు, షేక్ ఫకీర్ సాహెబ్, వడ్డీ బోయిన నాగేశ్వరరావు, షేక్ రంజాన్, గండమాల రాయప్ప, మేదరమెట్ల రాజారావు, కావూరి శంకర్రావు, బోడేపూడి వెంకటేశ్వరరావు, భాగం పాపారావు, వడ్డెబోయిన సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: