అయ్యప్ప స్వాములకు అన్నదానం

Published: Friday November 25, 2022
చౌటుప్పల్ నవంబర్ 24 (ప్రజాపాలన ప్రతినిధి):
శ్రీసత్యదేవ సహిత అయ్యప్ప స్వామి దేవాలయములో నిత్య అన్నదాన
కార్యక్రమములో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉబ్బు వెంకటయ్య వరమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మాలధారులకు అన్న దానము నిర్వహించడము నా పూర్వజన్మ సుకృతం అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవస్థానం అధ్యక్షులు బొబ్బిళ్ళ మురళి గురుస్వామి, చిలుకూరి ప్రభాకర్ రెడ్డి జెడ్పిటిసి, ఉప్పు భద్రయ్య, వైస్ ఎంపీపీ, కౌన్సిలర్ శైలజ భాస్కర్, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి మంజుల, రెక్కల సుధాకర్ రెడ్డి, వీరమల్ల సత్తయ్య గౌడ్ తూర్పాటి శంకర్ స్వామి, కంచరకుంట్ల వెంకట్ రెడ్డి స్వామి, కాంశెట్టి భాస్కర్ స్వామి, దేవరపల్లి గోవర్ధన్ స్వామి, ఉప్పు ఆంజనేయులు, జెల్లమురళి, సుక్క సుదర్శన్, ఉష్కాగుల నాగరాజు, నర్సింహ రెడ్డి స్వామి, గంట నాగరాజు, దొనకొండ కృష్ణ, తదితర భక్తులు పాల్గన్నారు.