ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన సంజయ్

Published: Monday May 24, 2021
మల్లాపూర్, మే 23, (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్ రావు తనయుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం మండలంలోని ప్రజా ప్రతినిధులు మరియు టిఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. ఆస్పత్రిలోని రికార్డులను, మందులను కోవిడ్ పరీక్ష కిట్లను పరిశీలించారు. ఆస్పత్రిలోని సిబ్బంది విధులకు క్రమం తప్పకుండా వస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ఆసుపత్రిలోని వసతులను సంజయ్ పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందిని కోరారు. హాస్పిటల్ సిబ్బంది హెల్త్ సర్వేల విషయంలో పలు సమస్యలు తెలుపగా వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపిపి కాటిపెల్లి సరోజన అదిరెడ్డి, వైస్ ఎంపిపి గౌరి నగేష్, ఎంపిటిసి ఆకుతోట రాజేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కదుర్క నర్సయ్య, రైతు వేదిక సమన్వయ కమిటీ అధ్యక్షులు కొమ్ముల జీవన్ రెడ్డి, దేవా మల్లయ్య, హెల్త్ సూపర్ వైజర్ శ్రీనివాస్, క్యాతం జీవన్ రెడ్డి, శరత్ గౌడ్, చిట్యాల లక్ష్మణ్, బండి లింగస్వామి గౌడ్, క్యాతం సురేష్, సోమ అశ్విన్ కుమార్, డబ్బా రమేష్ ఆసుపత్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.