18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోండి బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ

Published: Saturday December 03, 2022
బూర్గంపాడు ( ప్రజా పాలన.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని వివిధ పోలింగ్ బూత్ లలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందాలని  డిసెంబర్ 3,4, తేదీలలో నమోదు కార్యక్రమం ఉంటుందని బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించే తేదీలలో బూత్ లేవల్ అధికారులు పోలింగ్ తేదీలలో అందుబాటులో ఉంటారని 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటర్ మోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులని యువతి ,యువకుల ది కీలకపాత్రని వారు ఈ సందర్భంగా తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్క యువతీ యువకులు తమ అమూల్యమైన ఓటు హక్కును నమోదు చేసుకొని వారికి నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే అవకాశం మనకు రాజ్యాంగం కల్పించిందని కాబట్టి నిర్దేశించిన తేదీల్లో ఎవరైతే ఓటరుగా నమోదు కాలేదు వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత కోరారు.