ఉత్తరప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహన్ని కూల్చివేయడాన్ని ఖండిస్తున్నాం ** సిపిఐ(ఎంఎల్) రెడ్ స్టా
Published: Wednesday November 23, 2022
ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 22 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఉత్తర ప్రదేశ్ లో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేయడాన్ని సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా కార్యదర్శి గోగర్ల తిరుపతి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహంపై క్రమబద్ధంగా కొనసాగుతున్న కాల్చివేత, విద్యాంశం ఇది అన్నారు. ఈ విద్యాసం దళిత వర్గాలపై అగ్రవర్ణాల వారు జరుపుతున్న దాడుల నుండి దళిత వర్గాలపై నిరంతరం పెరుగుతున్న దౌర్జన్యాల నుండి విడదీయరానిధిగా భావించాలన్నారు. ఇది అగ్రవర్ణ కులాలు అధికారిక ప్రోత్సహంతో దేశమంతటా అంబేద్కర్ విగ్రహాలు తమ చిహ్నాలను దళితులు ప్రతిష్టించుకుంటున్న తరుణంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్య శక్తులన్నీ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏబీఎన్ జిల్లా అధ్యక్షులు పెందుర్ రాజేష్,సభ్యులు తిరుపతి, అనిల్, మల్లేష్ లు పాల్గొన్నారు.
Share this on your social network: