అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్

Published: Thursday August 04, 2022

మధిర ఆగస్టు 3 ప్రజా పాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విపి గౌతం సూచించారు. బుధవారం పట్టణంలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని ట్యాంకు బండ పనులను ఆర్ఓబి కింద ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు త్వర త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. అంతేకాకుండా అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు నిరంతరం పారిశుద్ధ్యర్ని మెరుగుపరచాలని ఆయన ఆదేశించారు అదేవిధంగా మండల పరిధిలోని రొంపిమల్ల గ్రామంలో దళిత బంధు కింద వివిధ ఈయనట్లు పొందిన లబ్ధిదారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దళిత బందు ద్వారా దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాంబాబు మున్సిపల్ చైర్ పర్సన్ మొండి తోక లత ఎంపీడీవో కుడుముల విజయభాస్కర్ రెడ్డి కమిషనర్ రమాదేవి ఏఈ నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.