క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్

Published: Friday December 24, 2021
మేడిపల్లి, డిసెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా క్రైస్తవ సోదర సోదరిమణులకు అందిస్తున్న క్రిస్మస్ కానుకలను గురువారం నాడు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ డివిజన్లోని క్రైస్తవలకు క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్  బండి రమ్య సతీష్ గౌడ్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని తెలిపారు. క్రైస్తవ సోదరీ సోదరీమణులకు  క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.