7వ వార్డు లో డ్రై డే ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆదేశాల

Published: Wednesday July 28, 2021
మధిర, జులై 27, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ చైర్మన్ లత జయకర్ కామిషనర్ అంబటి రమాదేవి ఆదేశాలు అనుసారం ఈరోజు 7వ వార్డు లో కౌన్సిలర్ మేడికొండ కళ్యాణి కిరణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే లో భాగంగా జ్వరం, జలుబు లాంటి లక్షణాలు గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు మాస్క్ లు ధరించకుండా ఉండే వారికి తప్పకుండ మాస్క్ ధరించాలని అవగాహన కల్పించడం జరిగిం డ్రై డే కార్యక్రమంలో భాగంగా ఇంటి పరిసరాలను నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, నీరు నిలువ ఉండటం వలన దోమలు చేరటంవల్ల  డెంగ్యూ మలేరియా వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పటం జరిగినది. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు మేడికొండ కిరణ్, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్ లు మరియు మెప్మా ఆర్ పి లు పాల్గొన్నారు.