హోం కంపోస్ట్ ప్లాస్టిక్ బకెట్స్ ను పంపిణీ చేసిన కార్పోరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి

Published: Saturday May 21, 2022
మేడిపల్లి, మే20 (ప్రజాపాలన ప్రతినిధి)

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్  11వ డివిజన్లో ఇంటింటికిి హోం కంపోస్ట్ ఎరువు తయారు చేయుటకు ప్లాస్టిక్ బకెట్స్ ను స్థానిక కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సహకారంతో డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. డివిజన్లో కొత్తగా వేయించిన ఐదు విద్యుత్ స్తంభాలకు     వీధి లైట్స్ ను ఏర్పాటు చేశామన్నారు.  ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అశోక్ రెడ్డి, ఆదిత్య మోహన్ ,మహేష్, రఘురాములు , శేశిధర్,నందిని ,లక్ష్మి, మరియు వార్డ్ జవాన్ రవి పాల్గొన్నారు.