*అంబేద్కర్ ప్రజా సంఘం షాబాద్ మండల అధ్యక్షునిగా బుడ్డిగారి హరిప్రసాద్ ఎన్నిక
Published: Friday September 30, 2022
చేవెళ్ల సెప్టెంబర్ 29:(ప్రజా పాలన)
షాబాద్ మండలం
హైతాబాద్ గ్రామానికి చెందిన బుడ్డిగారి హరిప్రసాద్ ను అంబేద్కర్ ప్రజా సంఘం షాబాద్ మండల అధ్యక్షునిగా నియమించడం జరిగింది. సంఘం రాష్ట్ర కార్యదర్శి బేగరి మహేష్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మైలారం సుబ్రహ్మణ్యం లు హరి ప్రసాద్ కు గురువారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక ఆర్థిక సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం యువత అంబేద్కర్ ప్రజాసంఘంలో చేరి సమసమాజని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా మండల అధ్యక్షునిగా నియమితులైన హరిప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల అధ్యక్ష పదవి అప్పగించినందుకు జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కార్యదర్శి బేగరి మహేష్, రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం లకు కృతజ్ఞతలు తెలిపారు. శక్తి వంచన లేకుండా సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్, శ్రీను, అనిల్ ,నందు యాదగిరి, కైజర్ ,శ్రీకాంత్ ,హరి, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: