ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి *అదనపు కలెక్టర్ తిరుపతిరావు జిల్లా రెవెన్యూ

Published: Tuesday January 10, 2023

సోమవారం రోజున రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా ప్రజల నుండి అదనపు కలెక్టర్ తిరుపతి రావు జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు.  వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు పరిశీలించి నిబంధనల మేరకు సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు.ఈ రోజు  ప్రజావాణిలో వివిధ అంశాలపై 120  దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.