వార్డు ప్రజల ఆరోగ్యమే లక్ష్యం

Published: Friday September 17, 2021
33వ వార్డు కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 16 సెప్టెంబర్ ప్రజాపాలన : వార్డు ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని 33వ వార్డు కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని 33వ వార్డులో ఇంటింటికీ వ్యాక్సినేషన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా వార్డులోని ప్రతి ఒక్కరు కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తీసుకోవాలని హితవుపలికారు. వ్యాక్సినేషన్ తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందని స్పష్టం చేశారు. కంటికి కనపడని శత్రువుతో పోరాడాలంటే తప్పనిసరిగా వ్యాక్సినేషన్ తీసుకోవాలని వివరించారు