7వ డివిజన్లో రెండవ దశ ఫీవర్ సర్వే

Published: Thursday May 27, 2021
బాలపూర్, ప్రజాపాలన ప్రతినిధి : కోవిడ్ 19 లక్షణాలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ బాలపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులు తీసుకోగలరని స్థానిక కార్పొరేటర్ సిద్ధాల బీరప్ప పేర్కొన్నారు. మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ కార్పొరేటర్ సిద్ధల బీరప్ప ఆధ్వర్యంలో  బుధవారం నాడు రెండవ దశ ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ. రెండవ దశలో ప్రతి ఇంటిని సందర్శించి కోవిడ్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి, బాలాపూర్ యు. పి హెచ్. సి. సిబ్బంది సహకారంతో ఉచిత మందులను అందజేయడం జరిగిందని అన్నారు. కరోనా మహమ్మారి వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మీర్ పేట్ మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, బాలాపూర్ యు.పి. హెచ్.సి ఇంచార్జ్ నర్సింగ్ రావు, ఏ ఎన్ ఎం, పి హెచ్ సి సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.