ఈనెల 20న సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ.

Published: Thursday February 17, 2022
జన్నారం రూరల్, పిబ్రవరి 16, ప్రజాపాలన: మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ అద్వార్యంలో ఏర్పాటు చేసిన సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఈ నెల 20న ఆవిష్కరించనున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలసాని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణకు రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి విరసనొల్ల శ్రీనివాస్ గౌడ్ ను ఆహ్వానించాలని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన రాష్ట్ర మంత్రుల ను, నాయకులను ఆహ్వానం పలకడానికి జిల్లా కమిటీ బాధ్యత తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. మండలం లోని గౌడ కులస్తులు అదిక సంఖ్యలో హాజరై కార్యక్రమ విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మోకుదెబ్బ  రాష్ట్ర సలహా దారులు గాజుల లింగగౌడ్, జిల్లా నాయకులు ఒళ్ళాల నర్సాగౌడ్, ఎరుకల రమేష్ గౌడ్, పొడేటి శ్రీనివాస్ గౌడ్, ఎనుగంటి కిరణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.