మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసిన విద్యార్థి సంఘం నాయకులు

Published: Friday February 04, 2022
మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 03, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా ప్రభుత్వ బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసిన విద్యార్థి సంఘం నాయకులు ఈ సందర్భంగా తెలంగాణ పద్మశాలి విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరల వంశీ మాట్లాడుతూ ప్రభుత్వ బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజనం రుచికరంగా అన్ని పోషక విలువలతో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తూ విద్యార్థుల ఎదుగుదలకు దోహదపడుతూ మధ్యాహ్నం భోజన నిర్వాహకుల పనితీరు చాలా బాగుందని, రుచికరమైన వంటలు వండి పెడుతున్నారని, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వంటలు వండి విద్యార్థులు వడ్డిస్తున్నారని, రాష్ట్రంలో ఉన్న ప్రతి పాఠశాలలో మంచి పోషక విలువలతో ఉన్న ఆహారాన్ని అందిస్తున్నందుకు కేసీఆర్ కు పాఠశాల లో ఉన్నా పారిశుద్ధ్య కార్మికులు పాఠశాల పరిసరాలను తరగతి గదులను, టాయిలెట్స్ ని శుభ్రంగా ఉంచుతూ ఏ విద్యార్థి కూడా కోవిడ్ బారిన పడకుండా చర్యలు తీసుకున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు బొడ్డుపెళ్లి శశికుమార్, శివతేజ, సాయి  తదితరులు పాల్గొన్నారని తెలిపారు.