*ఆటో యూనియన్ జెండా ఆవిష్కరణ* *పాల్గొన్న ట్రాన్స్పోర్ట్ జిల్లా కార్యదర్శి రుద్రా కుమార్* *సిఐ

Published: Wednesday March 29, 2023

చేవెళ్ల మర్చి28, (ప్రజాపాలన):-


చేవెళ్ల నియోజకవర్గం  మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు గ్రామపంచాయతీ బాలాజీ టెంపుల్ కమాన్ వద్ద నూతన ఆటో యూనియన్ సిఐటియు జెండాను ఎగరవేయడం ఎగురవేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  ట్రాన్స్పోర్ట్ జిల్లా కార్యదర్శి రుద్రకుమార్ హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మోటర్ వెహికల్ చట్టాన్ని రద్దు చేయాలని ఆటో కార్మికులకు అనేక సమస్యలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.అధిక చాలాన్లు వసూలు చేస్తూ వాళ్లను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఆటో కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఈఎస్ఐపిఎస్ సౌకర్యం కల్పించాలని ఆటో కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చేవెళ్ల డివిజన్ కన్వీనర్ అల్లి దేవేందర్ సిఐటియు గండిపేట్ మండల్ కన్వీనర్ ప్రవీణ్ కుమార్ చిలుకూరు ఆటో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఇమ్మానియేల్ చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు రవీందర్ సునీల్ ఏసు గిరి అనిల్ చినకర్ సాయిరాం ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ కుమార్ శ్రీనివాస్ గ్రామపంచాయతీ యూనియన్ మైనా బాద్ మండల నాయకులు ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.