మత్స్యకారుల అభివృద్ధి కోసం చేప పిల్లల పంపిణీ : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

Published: Thursday September 23, 2021
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 22 (ప్రజాపాలన) : జిల్లాలోని మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఉచితంగా చేపపిల్లలను సరఫరా చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు తో కలిసి జిల్లాలోని ఆడ ప్రాజెక్టు లో 91 వేల చేపపిల్లలను ప్రాజెక్టులో విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 267 చెరువులలో 34 ఎం ఎం నుండి 40 ఎం ఎం, సైదులు గల 66 లక్షల 67 వేల చేపపిల్లలు, 4 ప్రాజెక్టులు, 10 పెద్ద చెరువులలో 80 ఎంఎం నుండి 100 ఎంఎం సైజులు గల 71 లక్షల 29 వేల చేపపిల్లలు ఆడ ప్రాజెక్టు లో 21 లక్షల 60 వేల చేపపిల్లలను వేయడం జరిగిందని తెలిపారు. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి, జెడ్ పి టి సి, ఎంపీపీ, ఎంపీటీసీలు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.