మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత
Published: Wednesday April 20, 2022
మేయర్ జక్క వెంకట్ రెడ్డి
మేడిపల్లి, ఏప్రిల్ 19 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని మేయర్ జక్క వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ సాయిఐశ్వర్య కాలనీ రోడ్డు నెం13 లో స్థానిక కార్పొరేటర్ బైటింటి శారద ఈశ్వర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ లతో కలిసి రూ 25 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను మేయర్ జక్క వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: