పెరుమాండ్ల గణేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బి. ఎన్. రెడ్డి ట్రస్ట్ చెర్మన్ బిలకంటి శ

Published: Tuesday September 07, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం యాచారం మండలం నందివనపర్తి గ్రామానికి చెందిన పెరుమాండ్ల గణేష్ ఇటీవల విద్యుత్ షాక్ తో మరణించిన విషయం తెలిసిందే సోమవారం గ్రామ సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ, బి.ఎన్.రెడ్డి ట్రస్ట్ చెర్మెన్ బిలకంటి శేఖర్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి ట్రస్ట్ తరపున రూ 50,000/- లు వారి పిల్లల చదువుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు జోగి రెడ్డి, వార్డు సభ్యులు ఉమారాని అలెగ్జాజందర్, మేకం శంకర్,కరొబార్ మహేందర్ జై భీమ్ యూత్ సభ్యులు ప్రశాంత్, విక్రాంత్, తదితరులు పాల్గొన్నారు.