నాణ్యత ప్రమాణాల మీద నమ్మకంతో ప్రతి పైసలు ఇచ్చేలా ఉండాలి

Published: Friday June 04, 2021
బాలపూర్, జూన్ 03, ప్రజాపాలన ప్రతినిధి : వ్యాపారంలో పెట్టుబడి నమ్మకమే ప్రజల విశ్వాసం, నాణ్యత ప్రమాణాలు పాటిస్తే సరిపోతుందినీ మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఇన్చార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీ రాములు యాదవ్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎమ్ ఎల్ సి ఎంటర్ప్రైజెస్లోని డ్రాలో కారు గెలుపొందిన కృష్ణాపురం సర్పంచి నరసింహన్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...... స్కీమ్ లతో స్కాములు జరగకుండా చూడాలిని అన్నారు. పేదల ప్రతీ పైసాకు భరోసా ఇవ్వాలి శ్రీరాములు చెప్పారు. వ్యాపారంలో నమ్మకమే పెద్ద పెట్టుబడి అన్నారు. మీర్ పేట కార్పొరేషన్లో ఎమ్.ఎల్.పీ. వ్యాపారస్తులతో చాలా మంది వ్యాపారం మొదలు పెట్టినా అతికొద్దిమందే సక్సెస్ అవుతుంటారని గుర్తుచేశారు. ప్రజల విశ్వాసం, నమ్మకం చూరగొనాలంటే నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ... నిరంతరం కొత్త కోణంలో ఆలోచనలు చేయాలని చెప్పారు. స్కీమ్ ల వల్ల అనేక స్కాములు జరుగుతున్నాయని... అందువల్ల పేదలు నమ్ముకున్న ప్రతీ పైసాకు భరోసా ఇచ్చేలా ఉండాలని నిర్వాహకులకు సూచించారు అందెల. చివరి డ్రాలో కారు గెలుపొందిన క్రిష్టాపూర్ సర్పంచ్ నర్సింహాను అభినందించారు. ఈ కార్యక్రమంలో మీర్ పేట కార్పొరేషన్ అధ్యక్షులు భాజపా పెండ్యాల నర్సింహా, కార్పొరేటర్ అనితా ప్రభాకర్, చిత్రం శ్రీను, మాజీ ఎంపీటీసీ సిద్దాల దశరథ్, సాయి, నిర్వాహకులు మల్లికార్జున్, లక్ష్మణ్ చారి, ప్రవీణ్ సహా బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.