నిమజ్జనానికి కొలనును శుభ్రం చేయండి కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి

Published: Tuesday August 30, 2022
మేడిపల్లి, ఆగస్టు29 (ప్రజాపాలన ప్రతినిధి)
గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గణనాధుల నిమజ్జనానికి ఉప్పల్ నల్ల చెరువు సమీపంలోని కొలనును వెంటనే            శుభ్రం చేసి అందుబాటులోకి తేవాలని     స్థానిక కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి మున్సిపల్ అధికారులకు సూచించారు. సోమవారం కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి కొలనును సందర్శించి చేపట్టాల్సిన పనులను గురించి సూచించారు.
కొలనును శుభ్రం చేయడంతో పాటు కొత్త నీటిని నింపి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈ వసంత, బాకారం లక్ష్మణ్, వెంకట్ రెడ్డి ,రమణ ,లింగంపల్లి రామకృష్ణ ,దేవి రెడ్డి ,సల్ల ప్రభాకర్ రెడ్డి ,సుంకు శేఖర్ రెడ్డి ,ఆల్వాల్ భాస్కర్ ,రామ్ రెడ్డి ,జనగామ రామకృష్ణ ,తెల్కల రామ్ రెడ్డి ,పంగ దుర్గ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area