ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

Published: Saturday February 20, 2021
మల్లాపూర్, ఫిబ్రవరి19 (ప్రజాపాలన ) : ఛత్రపతి శివాజీ మహరాజ్ 391వ జయంతి సందర్భంగా శుక్రవారం మల్లాపూర్ మండల కేంద్రంలో భరతమాత కూడలి వద్ద ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను బజరంగ్ దళ్ కార్యకర్తలు మరియు కనక సోమేశ్వర స్వామి స్వాముల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కైరా నగేష్ మాట్లాడుతూ నిస్వార్థంగా ప్ర జలకు సేవచేయడం, తాను చేస్తున్న పనిపట్ల అంకితభావం, మచ్చలేని వ్యక్తిత్వం, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులు ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్పరాజుగా చేసాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు ముద్దం సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ 2మరిపెల్లి సత్తమ్మ -మల్లయ్య, బీజేవైఎం ప్రధానకార్యదర్శి ముత్యాల రాఖీ పటేల్, తెరాస పట్టణ అధ్యక్షులు బండి లింగస్వామి, కోటగిరి ఆనంద్, మొరపు గంగరాజం, మామిడి చిన్నారెడ్డి, ముత్యాల శ్రీనివాస్, చందా వెంకట్ నర్సయ్య,  బండి సత్యం, రామ నవీన్, కోటగిరి రాజు, బండి జైపాల్ బజరంగ్ దళ్, స్వాములు మినుగు నరేష్, నక్క రాజు, సంఘ సందీప్, ఉయ్యాల లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.