పండ్లు పూల మొక్కలు పెంపకానికి ప్రాధాన్యత _ దోమ సర్పంచ్ కే.రాజిరెడ్డి

Published: Monday January 09, 2023

వికారాబాద్ బ్యూరో 08 జనవరి ప్రజాపాలన : పండ్లు పూల మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తున్నామని దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి అన్నారు. దోమ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని పంచాయతీ కార్యదర్శి చంద్ర శేఖర్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా దోమ సర్పంచ్ కె.రాజిరెడ్డి మాట్లాడుతూ వచ్చే జూన్ నాటికీ హరితహారంలో భాగంగా నాటే మొక్కల పెంపకానికి బయట నుండి కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తూ మొక్క నాటే దశలో కావలిసిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉపాధి హామీ సిబ్బందికి తగు సూచనలు సలహాలు చేశామని వివరించారు. నాటిన మొక్కలకు కోతులు మేకల బెడద ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. వాచింగ్ వార్డులను పని చేసే వారిని నియమించుకోవాలని సర్పంచ్ సూచించారు. అనంతరం నర్సరీ ఫెన్సింగ్ పనులు పరిశీలించారు.