విద్యార్థులకు స్కూల్ యూనిఫాం పంపిణీ చేసిన జడ్పిటిసి దారిశెట్టి లావణ్య రాజేష్

Published: Wednesday February 01, 2023

కోరుట్ల, జనవరి 31 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఏకరూప దుస్తులను జడ్పిటిసి దారిశెట్టి లావణ్య రాజేష్ మంగళవారం రోజున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లావణ్య  మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు పుస్తకాలు డ్రెస్సులు ఒక పూట భోజనంఅందిస్తున్నారని ,అలాగే నాణ్యమైన విద్య అందిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యజమాన్యం, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.