విద్యార్థులకు స్కూల్ యూనిఫాం పంపిణీ చేసిన జడ్పిటిసి దారిశెట్టి లావణ్య రాజేష్
Published: Wednesday February 01, 2023
కోరుట్ల, జనవరి 31 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఏకరూప దుస్తులను జడ్పిటిసి దారిశెట్టి లావణ్య రాజేష్ మంగళవారం రోజున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు పుస్తకాలు డ్రెస్సులు ఒక పూట భోజనంఅందిస్తున్నారని ,అలాగే నాణ్యమైన విద్య అందిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యజమాన్యం, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: