కరోనా టీకాను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి : మాటూరి శ్రీనివాస్ గౌడ్

Published: Friday April 30, 2021
మేడిపల్లి, ఏప్రిల్ 29, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా టీకాను ప్రజలతో పాటు ప్రతి ఒక్క జర్నలిస్ట్ తీసుకోవాలని రాచకొండ మీడియా క్లబ్ అధ్యక్షులు మరియు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జర్నలిస్ట్ ల అక్రిడేషన్ కమిటీ సభ్యులు మాటూరి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఉప్పల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2వ డోస్ కరోనా టీకాను మాటూరి శ్రీనివాస్ గౌడ్  తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిి రెండోదశ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులు మిత్రులు ప్రతి ఒక్కరూ కరోనా టీకాను తీసుకోవాలని కోరారు.