కొమురం భీం విగ్రహావిష్కరణ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Friday April 14, 2023
రాయికల్,ఏప్రిల్ 13 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం జగన్నాథ్ పూర్ గ్రామంలో ఆదివాసుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన గిరిజన ఆరాధ్య దైవం శ్రీ కొమురం భీం విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన బిడ్డల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు కొమురం భీమ్,నేటియువతకు భీమ్ స్ఫూర్తిదాయకమనీ గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చివారితండాలను వారే పాలించుకోవాలని మన రాష్ట్రముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆలోచన రూపమే నూతన గ్రామపంచాయతిలనీ, గిరిజన అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్యారాణి జెడ్పిటిసి అశ్వినిజాదవ్ రాయికల్ మున్సిపల్ చైర్మన్ హనుమాన్లు,వైస్ ఎంపీపీ మహేశ్వరరావు, ఎంపీడీవో సంతోష్ కుమార్, పార్టీనాయకులు,గిరిజననాయకులు తులసిరామ్,కిరణ్ ,భీమ్రావు, భగవంతరావు ప్రజలు పాల్గొన్నారు.